Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు నియంత్రణ  – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  – బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిస్థాయిలో నివారించాలి – వాహనాలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలి – పరకాల ఏసీబీ సతీష్ 

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని పరకాల ఏసిపి సతీష్ బాబు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం నీరుకుల గ్రామంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా పరకాల ఏసిపి సతీష్ బాబు, ఆత్మకూరు సీఐ సంతోష్, పరకాల సిఐ క్రాంతి కుమార్, ఆత్మకూర్ శాయంపేట పర్కాల ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసులు ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. 25 వాహనాలకు ధృవీకరణ పత్రాలు, అది వాహనాలకు 32 వందల పెనాల్టీ వేశారు. గుడుంబా విక్రయదారులు కావటి లక్ష్మీనరసు, ఆశ్మీరా వెంకటేష్, నుంచి గుడుంబా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం ఎసిపి మాట్లాడుతూ ప్రజలకు ఏ అవసరం వచ్చిన డయల్ 100 కు, ఫోర్ జి నివారణ, సైబర్ మోసాలకు ప్రజలు మోసపోవద్దని ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానితులు గ్రామాల్లో తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మీ గ్రామస్తులు అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే పూర్తి స్థాయిలో నేరాలు నియంత్రణ జరుగుతుందన్నారు. గ్రామస్తులు ఎప్పటికప్పుడు పోలీసు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్డెన్ సర్చ్ లో వంద మంది పోలీసులు పాల్గొన్నారు

Related posts

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

TNR NEWS

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS

తాగునీటి కోసం తప్పని తిప్పలు  తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్

TNR NEWS

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS