November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు నియంత్రణ  – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  – బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిస్థాయిలో నివారించాలి – వాహనాలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలి – పరకాల ఏసీబీ సతీష్ 

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని పరకాల ఏసిపి సతీష్ బాబు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం నీరుకుల గ్రామంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా పరకాల ఏసిపి సతీష్ బాబు, ఆత్మకూరు సీఐ సంతోష్, పరకాల సిఐ క్రాంతి కుమార్, ఆత్మకూర్ శాయంపేట పర్కాల ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసులు ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. 25 వాహనాలకు ధృవీకరణ పత్రాలు, అది వాహనాలకు 32 వందల పెనాల్టీ వేశారు. గుడుంబా విక్రయదారులు కావటి లక్ష్మీనరసు, ఆశ్మీరా వెంకటేష్, నుంచి గుడుంబా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం ఎసిపి మాట్లాడుతూ ప్రజలకు ఏ అవసరం వచ్చిన డయల్ 100 కు, ఫోర్ జి నివారణ, సైబర్ మోసాలకు ప్రజలు మోసపోవద్దని ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానితులు గ్రామాల్లో తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మీ గ్రామస్తులు అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే పూర్తి స్థాయిలో నేరాలు నియంత్రణ జరుగుతుందన్నారు. గ్రామస్తులు ఎప్పటికప్పుడు పోలీసు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్డెన్ సర్చ్ లో వంద మంది పోలీసులు పాల్గొన్నారు

Related posts

ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు* – ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే – పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్‌ విఫలం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

TNR NEWS

తక్కువ ఖర్చుతో ఇంటికి హై క్లాస్ లుక్  *పేటలో డివైన్ ఇంటిరీయల్ ఎక్స్టెరియర్ సొల్యుషన్స్ ను ప్రారంభించిన డీఎస్పీ రవి

TNR NEWS

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Harish Hs

ఉత్సాహంగా కుంగ్ ఫూ కరాటే పోటీలు

TNR NEWS

గుడిబండ గ్రామంలో ఉర్సులో తీవ్ర విషాదం

Harish Hs

9 వార్డులలో వార్డు సభలు 

TNR NEWS