Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

టి.ఎస్.యు.టి.ఎఫ్ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం 

 

డిండి: (గుండ్లపల్లి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని మంగళవారం సాయంత్రం జరిగిన మండల మహాసభలలో ఎకగ్రీవంగా ఎన్నుకోవడమైంది.మండల అధ్యక్షులుగా గండమల్ల రామారావు, ప్రధాన కార్యదర్శిగా పవన్ నారోజు, ఉపాధ్యక్షులుగా కె. హరిలాల్,ఎం. సుజాత, కోశాధికారిగా వి.శ్రీనయ్య,ఎఫ్.డబ్ల్యూ.ఎఫ్ కన్వీనర్ గా ఎండి ఖాజా రహమతుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా,ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాస్ చారి,జిల్లా సాంస్కృతిక కన్వీనర్ గిరి యాదయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, డీఎస్సీ 2024లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల జాయినింగ్ తేదీ పై క్లారిఫికేషన్ ఇచ్చి,వారి మొదటి నెల వేతనాలు త్వరగా అందేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు తిరుపతయ్య, సుధాకర్,సీనియర్ నాయకులు బి.యాదయ్య,పూర్య నాయక్, ధనమ్మ,రాంబాబు,బుజ్జిరాణి,షాహీన్ మరియు నూతన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన. మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.

TNR NEWS

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న (04 ) ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

TNR NEWS

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు 

TNR NEWS

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS