Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

టి.ఎస్.యు.టి.ఎఫ్ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం 

 

డిండి: (గుండ్లపల్లి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని మంగళవారం సాయంత్రం జరిగిన మండల మహాసభలలో ఎకగ్రీవంగా ఎన్నుకోవడమైంది.మండల అధ్యక్షులుగా గండమల్ల రామారావు, ప్రధాన కార్యదర్శిగా పవన్ నారోజు, ఉపాధ్యక్షులుగా కె. హరిలాల్,ఎం. సుజాత, కోశాధికారిగా వి.శ్రీనయ్య,ఎఫ్.డబ్ల్యూ.ఎఫ్ కన్వీనర్ గా ఎండి ఖాజా రహమతుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా,ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాస్ చారి,జిల్లా సాంస్కృతిక కన్వీనర్ గిరి యాదయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, డీఎస్సీ 2024లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల జాయినింగ్ తేదీ పై క్లారిఫికేషన్ ఇచ్చి,వారి మొదటి నెల వేతనాలు త్వరగా అందేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు తిరుపతయ్య, సుధాకర్,సీనియర్ నాయకులు బి.యాదయ్య,పూర్య నాయక్, ధనమ్మ,రాంబాబు,బుజ్జిరాణి,షాహీన్ మరియు నూతన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత పై సమీక్ష.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి…జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs

గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి 

TNR NEWS

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

*దూసుకొస్తున్న తుఫాను.. తెలంగాణాలోనూ ఈ జిల్లాలలో భారీవర్షాలు..!!*

TNR NEWS