Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

 

కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో సత్తయ్య శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతి పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, కూరగాయలను పరిశీలించి,రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.తదనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా సాగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు 

TNR NEWS

ఎన్నికల్లో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి.. ఒకే శాఖలో రెండు సర్వీసు రూల్స్ హాస్యాస్పదం.. -బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి..

TNR NEWS

కార్యదర్శులు అప్పులపాలు..!!

TNR NEWS

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

TNR NEWS