Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

 

కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో సత్తయ్య శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతి పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, కూరగాయలను పరిశీలించి,రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.తదనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్లకు నాయకులకు ప్రతి ఒక్కరి ఒక్కరికి ధన్యవాదాలు.  మీడియా మిత్రులకు ధన్యవాదాలు.  మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS

బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ గా అడ్వకేట్ నిసాని రామచంద్రం  

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs