Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

 

సూర్యాపేట: ఎన్నికల ముందు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండారైతుల సంబరాలు అని ప్రభుత్వం ఆర్భాటంచేయడంలో అర్థం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారని, సంవత్సరకాలం అవుతున్న నేటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ నోచుకోలేదన్నారు.రైతు భరోసా ఎకరాకు 15000 చొప్పున ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు.రైతు పండించిన అన్ని రకాల పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామనటం సిగ్గుచేటు అన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వండిఏపి ధరలను మూడుసార్లుపెంచడం మూలంగా రైతాంగంపై బస్తాకు 200 రూపాయలు భారం పడుతుందన్నారు.ప్రభుత్వం వెంటనే డి ఏ పి ఇతర ఎరువులు, పురుగుల మందులుసబ్సిడీ ధరకేఇవ్వాలనికేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Related posts

తెలంగాణ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం బిజెపి  బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

TNR NEWS

ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఆకట్టుకున్న ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ విద్యార్థుల ప్రదర్శన

TNR NEWS

సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం  ….. కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్

TNR NEWS

పెద్దమ్మ, డబల్ బెడ్ రూమ్ కాలనీలలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.   సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

అమ్మాపురంలో రైతు దినోత్సవం  రైతు దినోత్సవం రోజు రైతులకు సన్మానం 

TNR NEWS