Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

 

సూర్యాపేట: ఎన్నికల ముందు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండారైతుల సంబరాలు అని ప్రభుత్వం ఆర్భాటంచేయడంలో అర్థం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారని, సంవత్సరకాలం అవుతున్న నేటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ నోచుకోలేదన్నారు.రైతు భరోసా ఎకరాకు 15000 చొప్పున ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు.రైతు పండించిన అన్ని రకాల పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామనటం సిగ్గుచేటు అన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వండిఏపి ధరలను మూడుసార్లుపెంచడం మూలంగా రైతాంగంపై బస్తాకు 200 రూపాయలు భారం పడుతుందన్నారు.ప్రభుత్వం వెంటనే డి ఏ పి ఇతర ఎరువులు, పురుగుల మందులుసబ్సిడీ ధరకేఇవ్వాలనికేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Related posts

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs

పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

Harish Hs

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉమ్మడి రవి

TNR NEWS

బీరప్ప స్వామి దేవాలయానికి ఆర్థిక సాయం అందజేసిన.  పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్

TNR NEWS

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS