Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

 

సూర్యాపేట: ఎన్నికల ముందు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండారైతుల సంబరాలు అని ప్రభుత్వం ఆర్భాటంచేయడంలో అర్థం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారని, సంవత్సరకాలం అవుతున్న నేటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ నోచుకోలేదన్నారు.రైతు భరోసా ఎకరాకు 15000 చొప్పున ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు.రైతు పండించిన అన్ని రకాల పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామనటం సిగ్గుచేటు అన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వండిఏపి ధరలను మూడుసార్లుపెంచడం మూలంగా రైతాంగంపై బస్తాకు 200 రూపాయలు భారం పడుతుందన్నారు.ప్రభుత్వం వెంటనే డి ఏ పి ఇతర ఎరువులు, పురుగుల మందులుసబ్సిడీ ధరకేఇవ్వాలనికేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Related posts

రిల్ హీరో లను కాదు రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి

TNR NEWS

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS

రైతాంగానికి రైతు భరోసా సరే….  వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఎక్కడ….  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

కులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సర్వేపై ప్రభుత్వం కీలక ప్రకటన..!

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

వాసవి మత మహా చండి పూజ

TNR NEWS