Tnrnews.in
తెలంగాణరాజకీయం

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

సూర్యాపేట:దేశంలో ఆందోళన కలిగించే స్థాయిలో మహిళలపై దాడులు , హత్యలు, హత్యాచారాలుజరుగుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. గురువారం 1 వార్డు కుడ కుడ హై స్కూల్ లో అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేసిన సెమినార్ కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయి అన్నారు. వయసుతో సంబంధం లేకుండా లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలు వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పని ప్రదేశాలలో ఫిర్యాదుల బాక్సులు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిన నేటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఉపాధ్యాయురాలు కవిత, ఐద్వా జిల్లా కోశాధికారి మేకన బోయిన సైదమ్మ, ఐద్వా జిల్లా నాయకురాలు పిండిగా నాగమణి, ఆవు దొడ్డి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

గాలివాన బీభత్సానికి నేలకొరిగిన చెట్లు

TNR NEWS

రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలి

Harish Hs

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS