Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

సూర్యాపేట:దేశంలో ఆందోళన కలిగించే స్థాయిలో మహిళలపై దాడులు , హత్యలు, హత్యాచారాలుజరుగుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. గురువారం 1 వార్డు కుడ కుడ హై స్కూల్ లో అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేసిన సెమినార్ కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయి అన్నారు. వయసుతో సంబంధం లేకుండా లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలు వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పని ప్రదేశాలలో ఫిర్యాదుల బాక్సులు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిన నేటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఉపాధ్యాయురాలు కవిత, ఐద్వా జిల్లా కోశాధికారి మేకన బోయిన సైదమ్మ, ఐద్వా జిల్లా నాయకురాలు పిండిగా నాగమణి, ఆవు దొడ్డి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ అభ్యర్థులు బిగ్ అలర్ట్.. గ్రూప్‌ 4 ఫలితాలు విడుదల..

TNR NEWS

ప్రతి రైతు నానో స్ప్రే వాడాలి

Harish Hs

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే

TNR NEWS

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS

కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష 

TNR NEWS