Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

సూర్యాపేట:దేశంలో ఆందోళన కలిగించే స్థాయిలో మహిళలపై దాడులు , హత్యలు, హత్యాచారాలుజరుగుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. గురువారం 1 వార్డు కుడ కుడ హై స్కూల్ లో అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేసిన సెమినార్ కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయి అన్నారు. వయసుతో సంబంధం లేకుండా లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలు వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పని ప్రదేశాలలో ఫిర్యాదుల బాక్సులు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిన నేటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఉపాధ్యాయురాలు కవిత, ఐద్వా జిల్లా కోశాధికారి మేకన బోయిన సైదమ్మ, ఐద్వా జిల్లా నాయకురాలు పిండిగా నాగమణి, ఆవు దొడ్డి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొండపల్లి గ్రామస్తులకు,డ్రైవర్లకు,రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహ సదస్సు… పెంచికల్ పేట్ ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో..

TNR NEWS

తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇండ్ల మాల్సుర్ జీవితం స్ఫూర్తిదాయకం

TNR NEWS

రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో నల్లబెల్లి పోలీస్ లు

TNR NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

ఘనంగా హోలీ సంబరాలు

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమగ్రంగా నిర్వహించాలి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి  మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య

TNR NEWS