Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట: నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డి (వి ఎన్) స్ఫూర్తితో నేడు పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో వియన్ 20 వవర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో వి. ఎన్. పాత్ర మరువలేనిది అన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చిన కడదాకా కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన మహా నాయకుడు విఎన్ అన్నారు. అనేకమంది శిష్యులను తయారుచేసి వారిని నాయకత్వం లోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు విఎన్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చీలికలు వచ్చినప్పుడు మొక్కవోని ధైర్యంతో పార్టీని కంటికి రెప్పలా కాపాడిన మహా నాయకుడు విఎన్ అన్నారు. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం వి ఎన్ చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. నలగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా సాగర్ డ్యాం నిర్మించడం జరిగిందన్నారు. బీబీనగర్ నుండి నడికుడి వరకు రైలు మార్గం నడపాలని జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఏడు దశాబ్దాల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు వి ఎన్ అన్నారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిడా రంబర జీవితాన్ని గడిపిన గొప్ప నాయకుడు విఎన్ అన్నారు. పదవుల కోసం ఏనాడు పాపులాడకుండా కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఎం పార్టీ బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో విఎన్ విశేష కృషి చేశారని అన్నారు. నేటికీ నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు నాయకులుగా ఉన్న వారంతా విఎన్ శిష్యులేనని అన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలకు రాష్ట్ర అధ్యక్షులుగా, పనిచేశారని రాష్ట్రంలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది ప్రజలను కదిలించి అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన గొప్ప పోరాట యోధుడు విఎన్ అన్నారు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా చాలాకాలం పని చేశారని ఆయన ఆశయాన్ని నేటి యువత ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, దండ వెంకట్ రెడ్డి, ఎల్గూరి గోవింద్, మేకన బోయిన శేఖర్ ,ధనియాకుల శ్రీకాంత్, జిల్లపల్లి నరసింహారావు, మద్దెల జ్యోతి, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ 2 టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి* * ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో సుష్మ 

TNR NEWS

మహిళలు వ్యాపారస్తులుగా మారాలి

TNR NEWS

చదరంగం పోటీల్లో విజేత సిద్ధార్థ

TNR NEWS

ఎస్ డబ్ల్యూ ఎఫ్ తోనే ఆర్టీసి కార్మికులకు న్యాయం   సూర్యాపేట డిపో విస్తృత స్థాయి సమావేశంలో రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్  ఎస్ డబ్ల్యూ ఎఫ్ లో పలువురు కార్మికుల చేరిక

TNR NEWS

ప్రవేట్ టీచర్లకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలి – టిపిటిఎల్ఎఫ్ డిమాండ్

TNR NEWS

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నవంబర్7,8 తేదీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగే సర్వేలను* *జయప్రదం చేయండి.*   *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు* 

TNR NEWS