Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

 

హత్నూర మండల గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం దౌల్తాబాద్ లో జరిగింది.ఆదివారం సమావేశంలో జి సాయిలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుండి గ్రామాన్ని శుభ్రంగా తయారు చేస్తున్న నేటికీ కనీస వేతనం లేదన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గ్రామపంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ప్రశ్నించారు గత పది సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వం వేతనాల పెంచాలని అనేక సందర్భాలు అడిగిన వేతనాలు పెంచకుండా పని భారం పెంచిందని గత సమ్మె సందర్భంగా మేము అధికారులకు వస్తే వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఊసు ఎత్తడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కనీస వేతనాలు చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో ఆరు నెలల నుండి వేతనాలు అందకుంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుడు ఎలా బతుకుతాడని ప్రశ్నించారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని లేనిచో ఎంపీడీవో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు నాగభూషణం గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు శంకర్ ఎల్లయ్య వెంకటయ్య అశోక్ రాములు, బిక్షపతి నాగయ్య నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Harish Hs

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు

TNR NEWS

జిల్లా అదనపు కలెక్టర్ చే సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

TNR NEWS

రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ముందుగా ఆసుపత్రికి వచ్చేలా చూడాలి* ఎన్.సి.డి సర్వే తీరును ఎం.ఎల్.హెచ్.పి లు పర్యవేక్షించాలి టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

TNR NEWS