Tnrnews.in
తెలంగాణ

కన్‌సాన్‌పల్లిలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణ అశ్రమంలో అన్నదాన కార్యక్రమం

అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామంలోని దత్తాశ్రమంలో ఆదివారం ఘనంగా శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు, 34వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ మహారాజ్‌ ఆధ్వర్యంలో ద్వజారోహణం కార్యక్రమం, పుండరీకం మహరాజ్, అంజయ్య మహారాజ్, ఛాయ పఠ పాదుకపూజతో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. కృష్ణాగౌడ్, సాయాగౌడ్, రాజా గౌడ్, వెంకటేశం గౌడ్, హరికృష్ణగౌడ్‌ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దత్త జయంతిని భక్తుల మద్య ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కన్‌సాన్‌పల్లి, జోగిపేట, కేరూర్‌ బిజిలిపూర్, ఖాదిరాబాద్, మాసానిపల్లి, గడిపెద్దాపూర్, నాగుల పల్లి, మర్వెళ్లి గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఆయా గ్రామాలకు చెందిన భక్త మండలుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు నిర్వాహకులు కట్టరామా గౌడ్, భక్తులు సత్యనారాయణ గౌడ్, రమేశ్‌ ముదిరాజ్, లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దేవాలయానికి రూ .లక్ష రూపాయలు విరాళం  

TNR NEWS

కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాదిగ లాయర్స్ ఫెడరేషన్

TNR NEWS

నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి… చింత వినయ్ బాబు జిల్లా కోఆర్డినేటర్,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

TNR NEWS

అరుహులందరికీ సంక్షేమ ఫలాలు — ఎమ్మెల్సీ దండే విఠల్

TNR NEWS

సాయి గాయత్రి విద్యాలయాలు ఘనంగా జరుపుకున్న రంగోలి ఉత్సవాలు

Harish Hs

మానవత్వమే మతం – మానవత్వమే ఈశ్వరత్వము : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS