Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ

 

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పాములపర్తి వేంకట నరసింహారావు గారు ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి.1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు. ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కారులను అమలుపరచెందుకు చర్యలు తీసుకున్నాడు.

Related posts

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

Harish Hs

TG UUEU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

TNR NEWS

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

Harish Hs

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువతరం ఉద్యమించాలి

TNR NEWS

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

TNR NEWS

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS