Tnrnews.in
తెలంగాణ

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి సురేష్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధాకర్ పీవీసీ కంపెనీ ఎంప్లాయిస్ కు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వాహనం నడిపే వ్యక్తితో పాటు,పక్కన ఉన్న వ్యక్తి తప్పనిసరిగ సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా గ్రామాల, మండలాలలో వాహనదారులు రోడ్లు దాటేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా చూసుకొని రోడ్డు దాటాలని చెప్పారు.ప్రభుత్వం నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలని తెలిపారు. వాహనదారుడు తన వాహనాన్ని పార్కు చేసేటప్పుడు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశంలో ప్రజలకు,ఇతర వాహనాలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ చేయాలని కోరారు.వాహనాల లైట్లను ఎక్కువ కాంతివంతంగా లేకుండా చూసుకోవాలని తెలిపారు.వాహనాలు యూటర్న్ తీసుకునేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి సిగ్నల్ ఇస్తూ, ముందు వెనక చూసుకొని నెమ్మదిగా వెళ్లాలన్నారు. క్రమం తప్పకుండా కారు మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మోటార్ రవాణా అధికారి జయప్రకాష్ రెడ్డి, ఏ ఆదిత్య,సహాయ వాహనా అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మజాహర్

TNR NEWS

గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు

TNR NEWS

అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం…. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలలో పోటెత్తిన మహిళలు

TNR NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS

సిపిఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

Harish Hs