Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన టి రమాదేవి జూలపల్లి మండలం వడ్కాపురం గ్రామంలోని తమ తండ్రి భూములు కబ్జాకు గురయ్యాయని, వీటి విషయమై మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పాస్ పుస్తకం రాలేదని, తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జూలపల్లి తాసిల్దార్ కు రాస్తూ విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంథని మండలం అడవి నాగ పల్లి గ్రామానికి చెందిన తోటపల్లి గుట్టయ్య తన తండ్రి పంట పొలాల కాసరి ఉద్యోగం వారసత్వంగా తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ అర్హతలను పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రామగిరి మండలం జల్లారం గ్రామానికి చెందిన లివ్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థ ఎన్.జి.ఓ భవన నిర్మాణానికి ఐదు గుంటల స్థలం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సూపరింటెండెంట్ ఈ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు  క్రీడల్లో రాణించాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి  నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి  పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

TNR NEWS

ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.

TNR NEWS

నేడు మోతే మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Harish Hs

మునగాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

TNR NEWS

“సమయ సద్వినియోగంతో సత్ఫలితాలు”

Harish Hs

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

TNR NEWS