Tnrnews.in
తెలంగాణ

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో గ్రామాల్లో రైతులు ఎలమాస పండుగను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా రైతు కుటుంబాలు పోలెలు, రకరకాల కూరగాయలు, పప్పులతో ప్రత్యేక వంటకాలను చేశారు. ఉదయాన్నే కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పొలాల్లోకి వెళ్లారు. పొలాల్లో భూదేవి అమ్మవారికి పాలు పొంగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది ఎలమాస పండుగను నిర్వహిస్తామని రైతులు తెలిపారు. మద్నూర్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఎలమాస పండుగను జరుపుకొన్నారు. ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లిన రైతన్నలు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ఎలా మాస పండుగను ఘనంగా జరుపుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

తొర్రూర్ లో జాతీయ మధింపు పరీక్ష 

TNR NEWS

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

Harish Hs

కార్యనిర్వాహణ అధికారిగా కే.వినోద్ బాధ్యతలు

TNR NEWS

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్‌ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

TNR NEWS

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs