Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

దుకాణ సముదాయాలు, గోదాములను ప్రారంభించిన మంత్రి

చేవెళ్ల మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన దుకాణాల సముదాయం మరియు గోదాములను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ప్రారంభించారు. డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గోదాములను రైతులు వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ భీం భరత్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం‌, ఆగిరెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, గోనే ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ యువజన నాయకులు మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వెయ్యాలి.  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో  బీద కుటుంబానికి టీ స్టాల్ పెట్టించి జీవనోపాధి కల్పించారు

TNR NEWS

జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలి

Harish Hs

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

కోదాడలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు………

Harish Hs

ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే టిఆర్ఎస్ నాయకులను అరెస్టులు

TNR NEWS