Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ పథకాలకు మరో అవకాశం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి పదకాలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా ధరఖాస్తూలను మళ్లీ చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంగళవారం గ్రామ, వార్డ్ సభలు నిర్వహించగ మొత్తం 475 గ్రామ పంచాయితీలు ఉండగా 142 గ్రామ సభలు, 05 మున్సిపాలిటీ పరిదిలోని 141 వార్డులలో 35 వార్డ్ సభలను అధికారులు నిర్వహించారు. గ్రామ సభలలో 357 మంది రైతు భరోసా కొరకు, 4593 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 4221 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 4418 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వార్డ్ సభలలో 50 మంది మంది రైతు భరోసా కొరకు, 07 గురు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 676మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 717 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 407 మంది రైతు భరోసా కొరకు, 4600 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 4897 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 5135 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

Related posts

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs

సర్వే పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ పమేలా సత్పతి

TNR NEWS

ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలి…. సర్వే త్వరగా పూర్తి చేయాలి….. జిల్లా అదనపు కలెక్టర్…..పి రాంబాబు 

TNR NEWS

ఏప్రియల్ 1 నుండి ప్రతి పేదవారికి పోషకాలతో కూడిన నాణ్యమైన 6 కేజీల సన్న బియ్యం

TNR NEWS