దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం ద్వారా సంక్రమించాయని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకొని సమాజంలో బాధ్యతగల పౌరులుగా మెలగాలని కోదాడ ప్రిన్సిపల్ అండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. భవ్య కోరారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంగళవారం కోదాడ కోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నాయని అందువల్లే రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా అందరికీ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ పూర్తిగా రాజ్యాంగం పైన ఆధారపడి నడుస్తున్నదని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి లోబడి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ చిత్తలూరు సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రాంరెడ్డి, జాయింట్ సెక్రెటరీ హనుమంత రాజు, కోశాధికారి కోడూరు వెంకటేశ్వరరావు, కార్యవర్గం హేమలత, దొడ్డ శ్రీధర్, సామా నవీన్, నాగుల్ పాషా, సీనియర్ న్యాయవాదులు వేజెర్ల రంగారావు, సాధు శరత్ బాబు, ఎం వి ఎస్ శాస్త్రి, తాటి మురళి, ఉయ్యాల నరసయ్య, జానీ పాషా, రాంబాయి, పలువురు జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు…
Save or share this story as a newspaper-style Epaper Clip:
