Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఉపాధి హామీ పనులు 20 రోజులు పూర్తి చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామనే నిబంధనను ఎత్తివేయాలి.          సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

మోతే :భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హత పథకం అర్హులు ఉపాధి హామీ పని ఏడాదికి కనీసం 20 రోజులు పని చేయాలని నిబంధనలను వెంటనే తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే మండలం రాఘవాపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో తాసిల్దార్ సంఘమిత్రకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూభూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా 20 రోజులు పని పోందిన కుటుంబాల ఆధార కార్డు, పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా రూ.12 వేల పథకానికి ఎంపిక చేస్తామని ప్రభుత్వం నిబంధనలు పెట్టడం సమంజసం కాదన్నారు. లబ్ధిదారులను కుదించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డు కలిగిన వారితోపాటు వలస కార్మికులను, కూలి పని చేసుకుని బతికే పేదలందరినీ అర్హులుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కొత్తగా జాబ్ కార్డులిచ్చి పనిదినాలు కల్పించాలని కోరిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో జాబ్ కార్డు పేరుతో ఆన్లైన్ పేరుతో 12 వేల రూపాయల పథకాన్ని కుదించి లబ్ధిదారులను తగ్గించాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కెన్నెర పోతయ్య, సిపిఎం గ్రామ కార్యదర్శి బూడిద లింగయ్య పాల్గొన్నారు.

Related posts

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ‌

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

ఎలక్ట్రానిక్ వాహన షోరూం ప్రారంభించిన ఎస్సై 

TNR NEWS

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

Harish Hs

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS

కార్తీక పౌర్ణమి మాసన గంగమ్మ ఆలయం లో ఘంగా పూజలు

TNR NEWS