Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జామియా మసీదు వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు పూర్తి చేయాలి – సిఎం హామీ పూర్తి చేయాలి

కాకినాడ : కాకినాడ పెద్ద మసీదు వద్ద మెయిన్ రోడ్ లో రోడ్ క్రాసింగ్ నిర్వహణకు వీలుగా జీబ్రా క్రాసింగ్ మార్కింగ్ ను ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం గత నవంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ వ్రాయగా కార్పోరేషన్ ఇంజనీరింగ్ విభాగం స్పందించి ప్రత్యక్ష పరిశీలన చేసి జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ పనులు చేపట్టలేదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడం వలన మసీదుకు ప్రార్థనల కోసం వచ్చే సీనియర్ సిటిజన్స్ పిల్లలు ట్రాఫిక్ అసౌకర్యంతో రోడ్డు దాటి వెళ్ళలేని ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రమాదాలకు గురవుతూ రోడ్డు మీద పడిపోతూ మోకాళ్లకు దెబ్బలు తగులుతున్న దుస్థితి వుందన్నారు. రంజాన్ మాసం మార్చి 2నుండి ప్రారంభం అవుతున్న దృష్ట్యా సిఎం పేషీ నుండి లభించిన హామీ పరిష్కారం పనులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

పీతల సత్యనారాయణ పదవీ విరమణ

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

TNR NEWS

పవన్ కళ్యాణ్ సంకల్పం… పిఠాపురం రైతాంగంలో ఆనందం

Dr Suneelkumar Yandra

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra

సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు..

TNR NEWS