Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

సూర్యాపేట టౌన్: గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తిపన్ను వన్ టైం సెటిల్ మెంట్ 90% వడ్డీ రాయితీ మున్సిపాలిటీలకు వెంటనే ప్రకటించాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాస్ సాయికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీతారామపురంలో జరిగిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024- 2025 సంవత్సరం సంబంధించిన ఆసిఫన్ను చెల్లించే వారి కి వడ్డీ 90% రాయితీ ఇవ్వడం ద్వారా ఇంటి పన్నులు 100 శాతం పూర్తయి మున్సిపాలిటీలకు ఆదాయం రావడానికి అవకాశం ఉందని అన్నారు. అనేక ప్రాంతాలలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని వాటి వసుల కోసం ఈ రాయితీ స్కీమ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఒకే రాష్ట్రంలో రెండు విధానాలు ఉండకుండా జిహెచ్ఎంసి తరహాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు,నగర పంచాయతీలకు తొంబై శాతం ఆస్తి పన్ను వడ్డీ మాఫీ ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, నగిరి జయమ్మ, పిట్టల రాణి, గంగపురి శశిరేఖ, ఒట్టే ఎర్రయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజల ముంగిట్లో ఎనిమిది సంక్షేమ పథకాలు… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది..  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

TNR NEWS

ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలి…. సర్వే త్వరగా పూర్తి చేయాలి….. జిల్లా అదనపు కలెక్టర్…..పి రాంబాబు 

TNR NEWS

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS

సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి  …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి 

TNR NEWS