Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

సూర్యాపేట టౌన్: గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తిపన్ను వన్ టైం సెటిల్ మెంట్ 90% వడ్డీ రాయితీ మున్సిపాలిటీలకు వెంటనే ప్రకటించాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాస్ సాయికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీతారామపురంలో జరిగిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024- 2025 సంవత్సరం సంబంధించిన ఆసిఫన్ను చెల్లించే వారి కి వడ్డీ 90% రాయితీ ఇవ్వడం ద్వారా ఇంటి పన్నులు 100 శాతం పూర్తయి మున్సిపాలిటీలకు ఆదాయం రావడానికి అవకాశం ఉందని అన్నారు. అనేక ప్రాంతాలలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని వాటి వసుల కోసం ఈ రాయితీ స్కీమ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఒకే రాష్ట్రంలో రెండు విధానాలు ఉండకుండా జిహెచ్ఎంసి తరహాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు,నగర పంచాయతీలకు తొంబై శాతం ఆస్తి పన్ను వడ్డీ మాఫీ ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, నగిరి జయమ్మ, పిట్టల రాణి, గంగపురి శశిరేఖ, ఒట్టే ఎర్రయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఉపాధ్యాయుని గొంతుకు చుట్టుకొని కోసుకొని పోయినా చైనా మాంజా

Harish Hs

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

TNR NEWS

బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

తేజా ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Harish Hs

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs