Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

 

మోతే: సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 29న గాంధీ పార్కులో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం మోతే మండల కేంద్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ నవంబర్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు మోతే మండలం నుండి వందలాది మందిని సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. 12 సంవత్సరాల తరువాత సూర్యాపేట పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుపుకోవడం సంతోషదాయకం అన్నారు. నవంబర్ 29న గాంధీ పార్క్ లో జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బీవీ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మిలు హాజరవుతున్నారని అన్నారు.నవంబర్30, డిసెంబర్ 1 తేదీల లో 500 మంది ప్రతినిధులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికై ప్రజలంతా హార్దికంగా,ఆర్థికంగా సహాయ సహకారాలుఅందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, గుంట గాని ఏసు, కిన్నెర పోతయ్య, నాగం మల్లయ్య,బానోతు లచ్చిరాం, చర్లపల్లి మల్లయ్య, జంపాల స్వరాజ్యం, దోసపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Harish Hs

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

TNR NEWS

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS