Tnrnews.in
తెలంగాణ

వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి

ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాయామం తోటే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానం, ఆహార పదార్థాల కల్తీ,ఉరుకుల,పరుగుల జీవితాలతో, మానసిక ఒత్తిడి వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పలు రకాల వ్యాధులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, పొట్ట జగన్మోహన్ రావు, పందిరి రఘువర ప్రసాద్, విద్యాసాగర్, గడ్డం నరసయ్య, చిగురుపాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు………

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

TNR NEWS

దేవాలయ విగ్రహాలకు భారీ విరాళం అందజేత

Harish Hs

విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి……..  అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే……..

TNR NEWS

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

TNR NEWS

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 

TNR NEWS