Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*మొంథా తుపాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నవంబర్ 3న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి*   తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట:మొంథా తుపాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు,వరదలు ,ఈదురు గాలులు వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాదిఎకరాల్లో వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు నష్టపోయాయని దెబ్బతిన్న పంటలను సర్వే జరిపి రైతాంగానికి నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తూఫాన్ వలన వరి కోత సమయం లో క్రింద పడి మొకాలు లోతు వర్షం నీరు నిల్వ ఉండి మొలకలు వచ్చాయి అని అన్నారు. కొన్ని పంటలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అన్నారు.నష్ట పరిహారాల నమోదులో స్వంత భూములు కలిగిన సాగు దారుల తోపాటు వాస్తవ సాగు దారులైన కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో వరి, మిర్చి, పత్తి,కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ముందస్తుగా కౌలు చెల్లించి పంటలు పండించారని, చేతికొచ్చే సమయానికి తుఫాను ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న అన్ని పంటలను సర్వే చేసి ఎకరానికి ఆహార పంటలకు రూ. 50,000 వాణిజ్య పంటలకు రూ. 75000, ఉద్యాన పంటలకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలాలలో పంట ముప్పై మూడు శాతం దెబ్బతింటే మాత్రమే పంటల పరిహారం అందించే నిబంధనలు సడలించి గ్రామం, సర్వే నెంబర్ ఆధారంగా దెబ్బతిన్న పంట నమోదు చేసి పరిహారం అందించాలి అని కోరారు, సిసిఐ కొనుగోలు నిబంధనలు సడలించి రంగు మారిన పత్తిని, గుడ్డుపత్తిని, మరియు వరి ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

TNR NEWS

రెండు ఆర్టీసీ బస్సులు డీ…

TNR NEWS

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి. – డివైఎఫ్ఐ డిమాండ్..

TNR NEWS

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

TNR NEWS

కడుపు మండిన రైతు,, ధాన్యంలోడుతో రోడ్డుకి అడ్డంగా పెట్టి ధర్నా

Harish Hs