Tnrnews.in
తెలంగాణ

*మొంథా తుపాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నవంబర్ 3న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి*   తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట:మొంథా తుపాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు,వరదలు ,ఈదురు గాలులు వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాదిఎకరాల్లో వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు నష్టపోయాయని దెబ్బతిన్న పంటలను సర్వే జరిపి రైతాంగానికి నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తూఫాన్ వలన వరి కోత సమయం లో క్రింద పడి మొకాలు లోతు వర్షం నీరు నిల్వ ఉండి మొలకలు వచ్చాయి అని అన్నారు. కొన్ని పంటలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అన్నారు.నష్ట పరిహారాల నమోదులో స్వంత భూములు కలిగిన సాగు దారుల తోపాటు వాస్తవ సాగు దారులైన కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో వరి, మిర్చి, పత్తి,కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ముందస్తుగా కౌలు చెల్లించి పంటలు పండించారని, చేతికొచ్చే సమయానికి తుఫాను ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న అన్ని పంటలను సర్వే చేసి ఎకరానికి ఆహార పంటలకు రూ. 50,000 వాణిజ్య పంటలకు రూ. 75000, ఉద్యాన పంటలకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలాలలో పంట ముప్పై మూడు శాతం దెబ్బతింటే మాత్రమే పంటల పరిహారం అందించే నిబంధనలు సడలించి గ్రామం, సర్వే నెంబర్ ఆధారంగా దెబ్బతిన్న పంట నమోదు చేసి పరిహారం అందించాలి అని కోరారు, సిసిఐ కొనుగోలు నిబంధనలు సడలించి రంగు మారిన పత్తిని, గుడ్డుపత్తిని, మరియు వరి ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

విద్యార్థులు కష్టపడి చదివిన చదువు వృధా కాదు

TNR NEWS

ఈనెల 26న జరిగే గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయండి

TNR NEWS

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు

TNR NEWS

జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయం………  చదరంగంతో పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుంది…….  శాస్త్రీయ సైన్స్ విజ్ఞాన ప్రగతి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం……….  జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు……

TNR NEWS

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

TNR NEWS