Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తమ్మర లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభ

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లు ప్రసాద్ లు అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మరలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభల సందర్భంగా రైతు సంఘం జెండాను ఆవిష్కరించి అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగి రెండు లక్షల రుణమాఫీ కానీ మిగిలిపోయిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలన్నారు. రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో నేటి వరకు జమ కాలేదని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, రైతు సంఘం సహాయ కార్యదర్శి అన్నెం పాపిరెడ్డి, పోతురాజు రాజేశ్వరరావు, దంతాల శేషయ్య, కొండ కోటేశ్వరరావు, రామకృష్ణ, బత్తినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు……..

Related posts

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లు ను ఉపసంహరించుకోవాలి

TNR NEWS

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

TNR NEWS

ప్రజావాణికి 93 దరఖాస్తులు…  ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు… జిల్లా కలేక్టర్ తేజస్  సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి….

TNR NEWS

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

TNR NEWS

ఇంజమ్మ అవ్వ గుడి ప్రారంభోత్సవంలో పాల్గొన్న- సరితమ్మ

TNR NEWS

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs