May 12, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం*

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మెరకు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల చేపట్టినటువంటి బంద్ విజయవంతం జరిగింది. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులు నుంచి పాఠశాలలో,హాస్టల్లో,గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని అలాగే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు మరణించారని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ అయితున్న ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లును విడుదల చేయాలని కోరారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే నాణ్యమైన భోజనం అందించకపోయినా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మైసమ్మ పెళ్లి రాహుల్,రవితేజ,పుర్మ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరెంట్ షాక్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

Harish Hs

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

TNR NEWS

మొదటి వర్ధంతి సందర్భంగా అనాధ ఆశ్రమంలో అన్నదానం

TNR NEWS

ఆపదలో అండగా బీమా

TNR NEWS

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

TNR NEWS

నేషనల్ హైవే పై సన్న కంకర తొలగించడంలో నిర్లక్ష్యం

Harish Hs