Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి సిబ్బంది అందరిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 సవరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మునగాల మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం ఎల్ నాగార్జున అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ తెలంగాణ గ్రామపంచాయతీ సిబ్బంది లందరినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 ని సవరించి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని పంచాయితీ సిబ్బంది నందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్, ఈఎస్ఐ,పిఎఫ్, సౌకర్యం కల్పించాలని కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు.

 ఈ కార్యక్రమంలో ఎల్ నాగార్జున, ఎం ఎంకన్న, ఎం ముత్తయ్య, పరుశురాములు, రాజు, సీతారాములు, సైదులు, నాగరాజు, వీరయ్య, రఘు, టీ ముత్తయ్య, సాగర్, తదితరులు పాల్గొన్నారు

Related posts

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

TNR NEWS

శాంతి భద్రతల పరిరక్షణక కోసమే కార్డెన్ సెర్చ్

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.

Harish Hs

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే

TNR NEWS