Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి సిబ్బంది అందరిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 సవరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మునగాల మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం ఎల్ నాగార్జున అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ తెలంగాణ గ్రామపంచాయతీ సిబ్బంది లందరినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 ని సవరించి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని పంచాయితీ సిబ్బంది నందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్, ఈఎస్ఐ,పిఎఫ్, సౌకర్యం కల్పించాలని కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు.

 ఈ కార్యక్రమంలో ఎల్ నాగార్జున, ఎం ఎంకన్న, ఎం ముత్తయ్య, పరుశురాములు, రాజు, సీతారాములు, సైదులు, నాగరాజు, వీరయ్య, రఘు, టీ ముత్తయ్య, సాగర్, తదితరులు పాల్గొన్నారు

Related posts

ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల బరిలో 22 మంది  

TNR NEWS

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

Harish Hs

నేటి నుండి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

Harish Hs

విద్యార్థులు పరీక్షలను జయించడం ఎలా

TNR NEWS

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs