Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా చికెన్‌, కోడి గుడ్లు పంపిణీ

పిఠాపురం : రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదు జనాలకి. అటువంటి జనాలు నేడు కోడి మాంసం తినడం మానేయడంతో చికెన్‌ వ్యాపారస్తులు నష్టపోతున్నారని వారికి మద్దతుగా నిలిచేందుకు పలు చికెన్‌ కంపెనీలు ముందుకు వచ్చి పలు రకాల స్టాల్స్‌ ఏర్పాటుచేసి జనాలను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ళకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందడంతో ప్రజలు చికెన్‌ తినడం మానేశారు. దీంతో చికెన్‌ తినడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని తునికి చెందిన వేంకటేశ్వర హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వెంకబ్‌ చికెన్‌ సంయుక్తంగా ఉచిత చికెన్‌ మేళా స్థానిక ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌లో పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా బ్రాంచ్‌ మేనేజర్‌ దుర్గా ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ తెలిపిన ప్రకారం 70డిగ్రీల కంటే ఎక్కువ వేడిలో గుడ్లు, కోడి మాంసం ఉండటం వల్ల బర్డ్‌ ఫ్లూ వైరస్‌ చనిపోతుందని, అది తినడం వల్ల ప్రజలకు ఎటువంటి హానీ జరగదన్నారు. పిఠాపురం పట్టణంలో సుమారు 2000 మందికి పైగా చికెన్‌, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

Related posts

డిప్యూటీ సి ఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సారా జోరు యధాతధంగా వుంది!! – కట్టడి చేయించాలని కోరుతున్న పౌర సంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

TNR NEWS

ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఎప్పటి నుంచి అంటే?

Dr Suneelkumar Yandra

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TNR NEWS

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

TNR NEWS