Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైములను పరిష్కరించాలి.  భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు

మోతే : పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్లను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉండటం మూలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు దారి మళ్లించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారానే నేరుగా సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట భవన నిర్మాణ కార్మిక సంఘం మండలం ఉపాధ్యక్షులు గట్టు శ్రీను, నాయకులు షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆశా”ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి  సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన కలెక్టరేట్ ముందు ఆశాల నిరసన

TNR NEWS

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

TNR NEWS

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

TNR NEWS

చెరువుల మరమత్తుల పనులకు భూమి పూజ

TNR NEWS

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై గోపాల్ రెడ్డి

TNR NEWS

పేదలకు అన్నదానం పుణ్యకార్యం

Harish Hs