Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు జీవించిన బచ్చలకూరి జార్జి

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అందరికీ ఆదర్శప్రాయంగా బచ్చలకూరి జార్జి చివరి వరకు జీవించారని విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత,తెలంగాణ ఉద్యమకారుడు, హేతువాది బచ్చలకూరి జార్జి సంతాప సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేద దళిత కుటుంబంలో జన్మించి స్వయం శక్తితో ఎదిగి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలు చేరెందుకు కృషి చేశారని దళితుల్లో నిరక్షరాస్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు తన భార్యతో కలిసి చదువు వెలుగు ఉద్యమంలో పని చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో జరుగుతున్న అణచివేత, కుల వివక్ష, అవినీతి, అక్రమాలు మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారని ఆయన సేవలను స్మరించారు. జార్జి మృతి సమాజానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, పొట్ట జగన్మోహన్ రావు, విద్యాసాగర్, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు……..

Related posts

ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి: కే.చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కన్వీనర్

TNR NEWS

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

చెరువుల మరమత్తుల పనులకు భూమి పూజ

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

Harish Hs

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS