Tnrnews.in
తెలంగాణ

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్ని బంద్ చేయించి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని అన్ని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకులాలు, కస్తూరిబా పాఠశాలలో మరియు ఇతర వసతి గృహాల్లోఫుడ్ పాయిజన్ ఘటనల పై తగు విచారణ నిర్వహించి,బాధ్యులపై చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో పొడుపాయిజన్ ఘటనలు జరగకుండా నివారించాలని అన్నారు.పెండింగ్ మెస్ కాస్మోటిక్ మరియు మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని, కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఉపకార వేతనాలు విడుదల చేయాలని,బెస్ట అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేనియెడల, రానున్న కాలంలో విద్యార్థి ఉద్యమాన్ని బోలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ ,ముస్తఫా, చందు, సాయి,తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేడు మునగాల లో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలి

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

TNR NEWS

సామజిక,ఆర్థిక,అసమానతలకు విరుగుడు విద్యే నల్గొండలో సావిత్రి బాయిపులే జయంతి పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNR NEWS

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

TNR NEWS

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని విజయోత్సవ సభలు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి 

TNR NEWS