Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

కోదాడ పట్టణంలోని సాయిబాబా థియేటర్ వీధిలో షాప్ నెంబర్ 3 కే శ్రీనివాస్ డీలర్ రేషన్ షాపులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని టి పి సి సి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఇళ్ల లో ప్రతిరోజు పండగ వాతావరణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు ఈ పథకం ప్రారంభించారనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అంబడి కర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు వేలాద్రి, మైస రమేష్, కందర బోయిన వీర స్వామి, డీలర్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు……….

Related posts

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

TNR NEWS

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

TNR NEWS

*తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!*

Harish Hs

గుడి నిర్మాణ దాతకు ఘన సన్మానం

Harish Hs