Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విలువలతో కూడిన విద్యను అందించాలి

విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుశీల భాయీ పట్టణ మహిళా ప్రముఖులు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యతను గుర్తించి వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశ నలుమూలల నుంచి వివిధ హోదాలలో సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వం చేత మంజూరైన నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పథకానికి ఎంపికైన 9వ క్లాస్ విద్యార్థిని భావనకు 12 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమీల, బంగారు నాగమణి, రిటైర్డ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు, పుణ్యవతి స్వరూప,పార్వతి,అరుణ తదితరులు పాల్గొన్నారు…………

Related posts

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజా పాలన పేరుతో పబ్బం గడుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు

TNR NEWS

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

TNR NEWS

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా

Harish Hs

సిల్వర్ డేల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ● ఆ స్కూల్ బస్సుల వరుస ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, ఎంఈఓ లకు ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

TNR NEWS