ముస్తాబాద్ మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి 22 చెక్కులు రాగా 9 లక్షల 25వేల రూపాయల పేద మధ్యతరగతి కుటుంబాల లబ్ధిదారులకు
సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్క ప్రణాళికతో సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు వైద్య ఖర్చులకు అండగా నిలుస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ బీసి సెల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ గూడెం మద్దికుంట బందనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు బాబు దొనుకుల కొండయ్య తుపాకుల శ్రీనివాస్ మామిండ్ల ఆంజనేయులు యాగండ్ల మల్లేశం షాదుల్ పాప పుల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.