Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి

ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాయామం తోటే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానం, ఆహార పదార్థాల కల్తీ,ఉరుకుల,పరుగుల జీవితాలతో, మానసిక ఒత్తిడి వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పలు రకాల వ్యాధులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, పొట్ట జగన్మోహన్ రావు, పందిరి రఘువర ప్రసాద్, విద్యాసాగర్, గడ్డం నరసయ్య, చిగురుపాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు………

 

Related posts

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలి…సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి…. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి….. మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

కుమారుడి పుట్టినరోజున అనాధాలకు అన్నదానం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు

TNR NEWS

డివైఎఫ్ఐ ఆద్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

TNR NEWS

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs

పద్మశాలి ఐక్యవేదిక జిల్లా కమిటీ లో కోదాడ వాసుల నియామకం

Harish Hs

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS