Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు,ముట్టుకోకుండా, అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రయాణ సమయంలో రోడ్లు, వంతెనలు తెగిపోయిన రాకపోకలకు ఆటంకాలు ఎదురైతే పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు. చెరువులు, వాగులు, కుంటలు, నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు.పాత పాడుబడ్డ ఇళ్లలో నివసించరాదని,బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 100 కాల్ చేస్తే ప్రత్యేక సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపారు.

Related posts

మహా మండల పూజలు విజయవంతం చేయాలి… ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య

TNR NEWS

*నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహనాల వేలం పాట*

TNR NEWS

సైబర్ నేరాల పై అవగాహన

TNR NEWS

ఉచిత విద్యుత్ కోసం కొత్త రేషన్ కార్డుదారులు ఇలా చేయండి

TNR NEWS

రావి చెట్టును రక్షించాలంటూ కార్యదర్శికి వినతిపత్రం

TNR NEWS

చట్టాలపై అవగాహనతో ఉజ్వల భవిష్యత్తు……..  అందరికీ న్యాయం పొందే హక్కు రాజ్యాంగం కల్పించింది……  విద్యార్థులు నేరాల జోలికి వెళ్ళవద్దు…….  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు……….  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ…పి.శ్రీవాణి…

TNR NEWS