తెలంగాణ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు ఈ పథాకాన్ని పొందేందుకు విద్యుత్ బిల్లులోని కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును అనుసంధానం చేసి అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసి నింపాలి. తర్వాత స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీ కేంద్రాల్లోని అధికారులకు దాన్ని సమర్పించాలి.
Save or share this story as a newspaper-style Epaper Clip:
