Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 31న కాంట్రాక్టు లెక్చరర్స్ రాష్ట్ర కౌన్సిల్ అత్యవసర సమావేశం

గొల్లప్రోలు : చివరి దశలో నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పునఃప్రారంభించాలని, మే నెల సంబందించిన 2024 మరియు 2025 వేతనాలు తక్షణమే విడుదల చేయాలని తదితర సమస్యల పై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కాంట్రాక్టు లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి అత్యవసర సమావేశం ఈ నెల 31 న విజయవాడ యూటీఎఫ్ భవన్ జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు హాజరౌతారని తెలిపారు. రాష్ట్ర నలు మూలల నుండి కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికి తమ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ లకి విజ్ఞప్తి చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర నాయకులు కె.రత్నకుమారి, బి.జె.గాంధీ, జాన్ బాబు, శేషగిరి, ఉమాదేవి, లతా, శాం కిరణ్, కాశీ రత్నం, ఖాదర్ వల్లీ తదితరులున్నారు.

Related posts

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

TNR NEWS

ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra

చోడవరం పర్యటనకు రావాలని నాగేంద్ర బాబుకు రాజు ఆహ్వానం

గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఆంక్షలు విధించవద్దు – విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు

Dr Suneelkumar Yandra

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

Dr Suneelkumar Yandra