Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతుల పాలిటి దైవం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ఆర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను అంకురార్పణ చేసిన మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించి ఆయన మాట్లాడారు. నాడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు రైతులకు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ, కుయ్ కుయ్ అని 108, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు సాగునీరు కోసం ప్రాజెక్టులు వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముఖ్య మంత్రి గా రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన రైతు పక్ష పాతి వైఎస్ ఆర్ అన్నారు. చెరగని చిరునవ్వు తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న మహా నేత వైఎస్ ఆర్ అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు, టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి తో కలిసి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పెండ వెంకటేశ్వర్లు, గుండెల సూర్యనారాయణ, కాజా గౌడ్, కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్, తిపిరిశెట్టి రాజు, కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు, బాల్ రెడ్డి, కాంపాటి పుల్లయ్య, బాజన్, బాగ్దాద్, గంధం పాండు, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి 

TNR NEWS

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి. ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలి. మహిళ జర్నలిస్టుల కోసం రవాణా సౌకర్యం కల్పించాలి. టిడబ్ల్యూజేఎఫ్ వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య

TNR NEWS

కానిస్టేబుల్ నరేష్ పై దాడి చేసిన వారిని‌ శిక్షించాలి

Harish Hs

వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శం- ములకలపల్లి రాములు

Harish Hs

విద్యార్థులు సైబర్ నేరాల పైన అవగాహన కలిగి ఉండాలి

Harish Hs