Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

 

గిరిజన గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ జనరల్ మేనేజర్ ట్రైకార్ బి.రవికుమార్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని గిరీనగర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహం భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలలో భాగంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్తీ అభ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంను ప్రారంభించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో 954 గిరిజన గ్రామ పంచాయతీలను ఎంపిక చేసిన గ్రామపంచాయతీలకు అన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లాలోని 17 గిరిజన గ్రామ పంచాయతిలను ఎంపిక చేయడం జరిగిందని, ఇట్టి గ్రామాలలో 15 నవంబర్ 2024 నుండి 26 నవంబర్ 2024 వరకు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ పంచాయతీలల్లో కల్పించవలసిన మౌలిక వసతుల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్, రిటైర్డు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎల్.పాండు నాయక్, కార్యాలయ పరిపాలన అధికారి పి.శాంతి కుమార్, వార్డెన్లు గిరిధర్ రెడ్డి, కవిత, ఝాన్సీ, రాణి, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. శ్రీనివాసులు, వి.ప్రియాంక, కార్యాలయ సిబ్బంది శివరాజు, నాగరాజు, సైదా నాయక్, సైదులు, లింగా నాయక్, దేవ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము

TNR NEWS

రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ముందుగా ఆసుపత్రికి వచ్చేలా చూడాలి* ఎన్.సి.డి సర్వే తీరును ఎం.ఎల్.హెచ్.పి లు పర్యవేక్షించాలి టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

TNR NEWS

చిన్న వర్షానికే ప్రమాదకరంగా మారిన డబుల్ రోడ్డు రోడ్డు వేశారు సూచిక బోర్డులు మరిచారు

TNR NEWS

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Harish Hs

నేడు మునగాల లో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలి

TNR NEWS