Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు కార్మిక యూనియన్ కార్యకలాపాలాలకు అనుమతించాలని, కిలోమీటర్లు పెంపు, వేధింపులు ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజామాన్యం చర్యలు తీసుకోవాలని సిఐటియు సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం. రాంబాబు, నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం నాడు సిఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయము లో తాము ఎన్నికల్లో గెలిస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తానని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిపేస్టో పొందుపరచిందని, ఏడాది పూర్తి అవుతున్నా సమస్యలు పరిష్కారం చేయలేదని, కొత్త సమస్యలు రోజురోజుకు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు.గత టీఆర్ యస్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలనే కాంగ్రెస్ పార్టీ కూడా వాటినే కొనసాగిస్తున్నట్లుగా కార్మికులు అభిప్రాయ పడుతున్నట్లు అన్నారు. సర్వీస్ కండిషన్స్ ఘోరంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.చట్ట విరుద్ధంగా రన్నింగ్ టైమ్ తగ్గించటం , రెస్టు టైమ్ పెంచటం వలన కార్మికులకు పని గంటల నియంత్రణ లేకపోవటం వలన కార్మికులు శారీరక, మానసిక అందోళనలకు చెంది అనారోగ్యా లకు గురైతున్నారని అన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, కార్మికులు ఐక్యం అయి పోరాటం చేయ వలసిన అవసరం అనివార్యంగా ఏర్పడిదన్నారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి మాట్లాడుతూ మహిళా కండక్టర్ లకు డ్యూటీ చార్ట్ లో సింగిల్ క్రూ వేయటం వలన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబ బాగోగులు, ఇంటి పనులు వలన నేటికీ మహిళలు సమాజం లో స్వేచ్ఛ గా మన గలుగలేని పరిస్థితులు ఉన్నాయనిఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికుల, ఉద్యోగుల యెడల వివక్షత కొనసాగుతున్నదని దాని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు ఏకలక్ష్మి, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, డిపో అధ్యక్షులు గుండు రమేష్, నాయకులు శ్రీనివాస్, వీరాస్వామి, ప్రసాద్, మల్లయ్య, నాగార్జున,రసూల్ తదితరులు పాల్గొన్నారు

Related posts

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం……..

Harish Hs

హోరాహోరీగా కోదాడ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

Harish Hs

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..  రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ

TNR NEWS

ప్రజావాణికి 120 ఫిర్యాదులు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్.

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS