Tnrnews.in
తెలంగాణరాజకీయం

ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శం 

 

ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉక్కు మహిళ వీర వనిత గరీబ్ హటావో నినాదంతో పేదరికాన్ని తొలగించి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చి అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరన్న నాయక్, అబ్దుల్ రహీం,తంగెళ్ల కరుణాకర్ రెడ్డి,కుమ్మరికుంట్ల వేణుగోపాల్,ఎలిమినేటి అభినయ్, సిరివెళ్ల శభరినాధ్,గండూరి రమేష్,నాగుల వాసు,రుద్రంగి రవి,సాయి నేత,గడ్డం వెంకన్న, అన్నమయ్య రాము,కోడి శివ,ఆలేటి మాణిక్యం, రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమే….  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

TNR NEWS

నర్సరీల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Harish Hs

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS

కస్తూర్బా స్కూలు తనిఖీ చేసిన ఎంపీడీవో

TNR NEWS