May 11, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

టి ఎన్ ఆర్ న్యూస్ హైదరాబాద్

 

హైదరాబాద్:నవంబర్ 11

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతు న్నారని మండిపడుతు న్నారు.

 

రైతులు. సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారన్నారు. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాపోతు న్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలంటూ పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.

 

మిల్లుల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అన్యాయం చేస్తున్నారని.. తేమశాతం, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

 

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) చట్టం కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సోమవారం మాట్లాడారు.

రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Related posts

నేడు మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహావిష్కరణ

TNR NEWS

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

TNR NEWS

20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్‌ ట్రైనింగ్‌ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు

TNR NEWS

సాంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి

Harish Hs

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

TNR NEWS