Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

టి ఎన్ ఆర్ న్యూస్ హైదరాబాద్

 

హైదరాబాద్:నవంబర్ 11

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతు న్నారని మండిపడుతు న్నారు.

 

రైతులు. సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారన్నారు. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాపోతు న్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలంటూ పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.

 

మిల్లుల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అన్యాయం చేస్తున్నారని.. తేమశాతం, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

 

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) చట్టం కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సోమవారం మాట్లాడారు.

రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Related posts

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

TNR NEWS

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

TNR NEWS

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

Harish Hs

రాష్ట్రస్థాయిలో కోదాడ శ్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

TNR NEWS