Tnrnews.in
తెలంగాణ

జీవీకే ఫ్యామిలీ హోటల్& రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు లోని పాత సాయి బిందు రెస్టారెంట్ బిల్డింగ్ లో నిర్వహకులు నడిగూడెం మాజీ ఎంపీపీ కాసాని విమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించి మాట్లాడారు.రెస్టారెంట్ యజమానులు స్థానికులకు ఉపాది అవకాశాలు కల్పించి నిరుద్యగులకు జీవన భృతి కల్పించాలన్నారు.వ్యాపార వాణిజ సంస్థల ఏర్పాటుతో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు.జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ యజమానులు నాణ్యమైన ఆహార పదార్థాలు, సేవలు అందజేసి పేరు గడించాలన్నారు.నాణ్యమైన సేవలతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరాలకు ధీటుగా రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్నేని బాబు, చందర్రావు, ముత్తావరపు పాండురంగారావు, లక్ష్మీనారాయణ రెడ్డి, దేవ బత్తిని రమేష్, గడ్డం మల్లేష్ యాదవ్, బూతుకూరి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సందడిగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Harish Hs

వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లు కు వ్యతిరేకిస్తూ ముస్లింల నిరసన

TNR NEWS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

TNR NEWS

పదవ తరగతి పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలి

Harish Hs

రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ముందుగా ఆసుపత్రికి వచ్చేలా చూడాలి* ఎన్.సి.డి సర్వే తీరును ఎం.ఎల్.హెచ్.పి లు పర్యవేక్షించాలి టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

TNR NEWS