Tnrnews.in
తెలంగాణ

జీవీకే ఫ్యామిలీ హోటల్& రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు లోని పాత సాయి బిందు రెస్టారెంట్ బిల్డింగ్ లో నిర్వహకులు నడిగూడెం మాజీ ఎంపీపీ కాసాని విమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించి మాట్లాడారు.రెస్టారెంట్ యజమానులు స్థానికులకు ఉపాది అవకాశాలు కల్పించి నిరుద్యగులకు జీవన భృతి కల్పించాలన్నారు.వ్యాపార వాణిజ సంస్థల ఏర్పాటుతో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు.జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ యజమానులు నాణ్యమైన ఆహార పదార్థాలు, సేవలు అందజేసి పేరు గడించాలన్నారు.నాణ్యమైన సేవలతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరాలకు ధీటుగా రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్నేని బాబు, చందర్రావు, ముత్తావరపు పాండురంగారావు, లక్ష్మీనారాయణ రెడ్డి, దేవ బత్తిని రమేష్, గడ్డం మల్లేష్ యాదవ్, బూతుకూరి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Harish Hs

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS

ఐదేళ్ళలో కోటిమందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ రామ్మూర్తియాదవ్*… *కాంగ్రెస్ విజయోత్సవ సభకు వరంగల్ తరలిన కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

TNR NEWS