Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

 

ఆరు దశాబ్దాల పాటు ఎంతో మంది ఉద్యమకారులు పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్తాపకులు సామ అంజిరెడ్డి, జెఎసి కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మిర్యాల వెంకటేశ్వర్లు, కోడి సైదులు లు అన్నారు. బుధవారం స్థానిక రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న నిర్వహించే ఉద్యమకారుల పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 24న సూర్యాపేటలో ప్రారంభమయ్యే ఉద్యమకారుల పాదయాత్ర ఉరూరా సాగుతూ ప్రజా ప్రతినిధులకు వినతులు సమర్పిస్తూ ఆఖరుగా భద్రచలం చేరుకొని ఉద్యమకారులను గుర్తించే సద్భుద్ధిని ప్రభుత్వానికి కల్పించాలని ఆ శ్రీరామచంద్రుడికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను గుర్తించకపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించి వారి ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వారికి తగిన గౌరవం కల్పిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రతి పథకంలో అవకాశం కల్పిస్తామని, ఇండ్లు కట్టిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సముచితరీతిలో పించన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రకు తెలంగాణ 1969 తొలిదశ ఉద్యమకారుల పూర్తి మద్దతు ప్రకటించి సంఘీబావం తెలుపుతున్నట్లు ఆ సంఘం నాయకులు బొమ్మిడి లక్ష్మినారాయణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కోతి మాధవి మధుసూదన్రెడ్డి, కిషన్, కె.గోపి, నరేంద్బణి విద్యాసాగర్, యూసుఫ్, చిత్రం భద్రమ్మ, మెడెబోయిన గంగయ్య, నకిరెకంటి మైసయ్య, కట్ట రాజు, మోర శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

TNR NEWS

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

Harish Hs

జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని వసతులు కల్పిస్తా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ క్రికెట్‌ విజేతలకు బహుమతుల ప్రధానం 

TNR NEWS

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

TNR NEWS

రవితేజ స్కూల్లో ఘనంగా గణనాథుని నిమజ్జనం

TNR NEWS