Tnrnews.in
తెలంగాణరాజకీయం

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హమీలను నెరవేర్చాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

కేబినెట్ సమావేశంలో కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హమీలు అమలుచేసే విధంగా నిర్ణయాలు తిసుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆయన గజ్వేల్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం బుణం, ఇతర ప్రయోజనాలు చేకూరే విధంగా అర్హత కార్డులను జారి చేయాలని డిమాండ్ చేశారు. సాగుదారులకు రైతు భరోసా ఇస్తామని చెబుతూనే అసలైన సాగుదారులను గుర్తించకపొవడం కౌలు రైతులను దగా చేయడమవుతుందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2033 సెప్టెంబర్ 13 న కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖలో దాదాపు 40 శాతం కౌలు రైతులే భూమిని సాగుచేస్తున్నారని వీరికోసం 2011 కౌలు రైతులకు కార్డులు ఇచ్చేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారికి న్యాయం చేస్తామని చెప్పిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. రైతు ఆత్మహత్య కుటుంబాలలో 75 శాతం మంది కౌలు రైతులే కాబట్టి వారికి న్యాయం చేకూర్చేవిధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. వ్వవసాయ కూలీ భరోసా కోసం ఆర్థిక సంవత్సరానికి 12 వేలు ఇచ్చేపథకానికి ఉపాధి హమీ కూలీలు 100 రోజులు పనిపూర్తిచేసిన వారికే ఇస్తామనే విషయం మిడియా ప్రకట ద్వారా తెలుస్తున్నందున ఇట్లా చేస్తే చాల కూలీ కుటుంబాలు నష్టపొయే అవకాశమున్నది గనుక జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి, ఎకరం లోపు పేదలకు ఇవ్వాలని, అదే విధంగా రైతు భరోసా పది ఎకరాల లోపు వారికి వర్థింపచేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండే విధంగా కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS

సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డులు అన్ని కార్యాలయాల్లో నియమించండి * నల్లబెల్లి మండలం తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేత సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు విజేందర్ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS