Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

 

సూర్యాపేట టౌన్: వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు, నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో జరిగిన నిమ్మ పిచ్చమ్మ సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన అనేక కూలి, భూమి పోరాటంలో ఆమె కీలక పాత్ర కుషించారని అన్నారు. మోతే మండలంనామవరం గ్రామానికి చెందిన నిమ్మ పిచ్చమ్మ గత 20 సంవత్సరాలుగా సూర్యాపేటలో నివాసం ఉంటూ పట్టణంలో వ్యవసాయ కార్మికులు, మహిళలు, దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాలలో ఆమె పాల్గొన్నారు అని అన్నారు. వన్ టౌన్ పరిధిలో జరిగిన అనేక కూలి, ఉపాధి పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె మరణంపట్టణ పేదలకువ్యవసాయ కార్మిక వర్గానికి తీరని లోటు అని ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నిమ్మ బిక్షం, నరేష్, వివిధ ప్రజాసంఘాల నాయకులు భయ్యా గంగరాజు, తండు నాగయ్య, బైరి రవి, కోల రవి, కారింగుల వెంకన్న, కోల కృష్ణ, కుంట్ల నాగిరెడ్డి తదితరులు పాల్గొని నిమ్మ పిచ్చమ్మచిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.

Related posts

గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

TNR NEWS

ఉత్సాహంగా కుంగ్ ఫూ కరాటే పోటీలు

TNR NEWS

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ కు కే ఎల్ ఎన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs

మేడిపల్లి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

TNR NEWS

నియామకపు ఉత్తర్వులకు తరలి వెళ్లిన జీపీఓలు

TNR NEWS

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS