Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో* 

పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, ఈనాటి ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుల పండుగ తేదీ:28.11.2024 నుండి 30:11.2024 జరుగుతుండగా, నేడు చివరి రోజు కావడంతో రైతులకు, ప్రజలకు ఏ విధమైన స్కీములు అందిస్తున్నాము. అనే దానిపై సంఘ అధ్యక్షుడు, చల్లా లింగారెడ్డి అధ్యక్షతన సంఘ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ చల్ల లింగారెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ మా సొసైటీ పరిధిలో ఇప్పటివరకు, 774 మంది రైతులకు, 4.59 కోట్లు రూపాయలు మాఫీ రాగా, మరల తిరిగి 635 మందికి, 4.81 కోట్ల రూపాయలు రుణబట్వాడా చేశాము . మా సంఘంలో 60% రుణమాఫీ జరిగింది. మిగిలిన 40% కూడా త్వరలో మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, 42,450 ఎరువుల బస్తాలు ఈ సీజన్ కు అందించాము. వాటి యొక్క విలువ 1.30 కోట్ల రూపాయలు. సకాలంలో మార్క్ ఫైడ్ వారికి చెల్లించాము. వరి ధాన్యం కొనుగోలు బోనస్ తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరంలో, సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ కల్పించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జి ఎస్ టి లేని వ్యవసాయం తెలంగాణ ప్రభుత్వంలో, వ్యవసాయానికి అవసరమైన వస్తువులు కొనుగోలుపై, ఉత్పత్తుల పై జి.ఎస్.టి పన్ను తొలగింపు చేయడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు నలమాస యాకయ్య, కత్తి కృష్ణ, మల్లేష్, రమేష్, యాకూబ్ పాషా, జయపాల్, యాకాంబరం పాల్గొన్నారు.

Related posts

క్రీడలు, శారీరక దారుఢ్యం,మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

TNR NEWS

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు 

TNR NEWS

పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు విడుదల చేయాలి

TNR NEWS

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

TNR NEWS

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs