Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో* 

పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, ఈనాటి ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుల పండుగ తేదీ:28.11.2024 నుండి 30:11.2024 జరుగుతుండగా, నేడు చివరి రోజు కావడంతో రైతులకు, ప్రజలకు ఏ విధమైన స్కీములు అందిస్తున్నాము. అనే దానిపై సంఘ అధ్యక్షుడు, చల్లా లింగారెడ్డి అధ్యక్షతన సంఘ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ చల్ల లింగారెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ మా సొసైటీ పరిధిలో ఇప్పటివరకు, 774 మంది రైతులకు, 4.59 కోట్లు రూపాయలు మాఫీ రాగా, మరల తిరిగి 635 మందికి, 4.81 కోట్ల రూపాయలు రుణబట్వాడా చేశాము . మా సంఘంలో 60% రుణమాఫీ జరిగింది. మిగిలిన 40% కూడా త్వరలో మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, 42,450 ఎరువుల బస్తాలు ఈ సీజన్ కు అందించాము. వాటి యొక్క విలువ 1.30 కోట్ల రూపాయలు. సకాలంలో మార్క్ ఫైడ్ వారికి చెల్లించాము. వరి ధాన్యం కొనుగోలు బోనస్ తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరంలో, సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ కల్పించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జి ఎస్ టి లేని వ్యవసాయం తెలంగాణ ప్రభుత్వంలో, వ్యవసాయానికి అవసరమైన వస్తువులు కొనుగోలుపై, ఉత్పత్తుల పై జి.ఎస్.టి పన్ను తొలగింపు చేయడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు నలమాస యాకయ్య, కత్తి కృష్ణ, మల్లేష్, రమేష్, యాకూబ్ పాషా, జయపాల్, యాకాంబరం పాల్గొన్నారు.

Related posts

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

TNR NEWS

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడులు…  ముగ్గురు అరెస్ట్…

TNR NEWS

అనంతగిరి అర్బన్ పార్క్ ను శంకుస్థాపన చేసిన స్పీకర్

TNR NEWS

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

TNR NEWS

నెహ్రూ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

TNR NEWS

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS